రెచ్చిపోయిన ఏటీఎం దొంగలు.. మూడు ఏటీఎంల్లో చోరీకి యత్నం

by  |
రెచ్చిపోయిన ఏటీఎం దొంగలు.. మూడు ఏటీఎంల్లో చోరీకి యత్నం
X

దిశ,వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎంకే ఎసరు పెట్టారు. కలెక్టర్ చౌక్ లోని ఎస్బీఐ ఏటీఎంలోని మిషన్‌ను ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో ఉన్న మనీని దొంగిలించి ఏటీఎంను బట్టి సవర్గామ్ బైపాస్ రోడ్డు సమీపంలో వదిలేసి వెళ్లారు. ఏటీఎంలో సుమారు రూ.30లక్షల నగదు ఉన్నట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మరోవైపు దేవేందర్ చౌక్ లోని మరో ఏటీఎం, జ్వువెలరీ షాప్ లో చోరీకి ప్రయత్నించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed