సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

by  |
సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్
X

దిశ, విశాఖపట్నం: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. విధ్వంసం, విచ్ఛిన్నం రెండు కళ్లుగా జగన్‌రెడ్డి పాలన సాగుతోందని, ప్రశాంత విశాఖ నగరాన్ని కక్ష సాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్ చేశారని విమర్శించారు. వైసీపీ నేతల పంపకాల్లో భాగంగానే ఫ్యుజన్ ఫుడ్స్ ఖాళీ చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంపై గౌరవం లేదు, ప్రజాస్వామ్యమంటే లెక్కలేదని మండిపడ్డారు. విశాఖ సిరిపురంలో టీడీపీ సానుభూతిపరుడనే కారణంతో ఫ్యూజన్ ఫుడ్స్ భవనాన్ని ఖాళీ చేయిస్తున్నారన్నారు.

Next Story

Most Viewed