ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆ ఇద్దరు..

by  |
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆ ఇద్దరు..
X

దిశ, స్పోర్ట్స్ : భారత ఆర్చరీ స్టార్ కపుల్ అతాను దాస్, దీపిక కుమారి వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్‌లో ఈ జంట స్పెయిన్‌పై 5-3 తేడాతో గెలుపొంది ఫైనల్ చేరుకున్నది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జరుగుతున్న ఈ కీలక టోర్నీలో భారత జంట ఫైనల్ చేరుకోవడంతో పతకాన్ని ఖాయం చేసుకున్నది. వరల్డ్ కప్ ఫైనల్స్ ఆదివారం జరుగనున్నాయి. ఈ జంట 5వ ర్యాంకులో ఉండటంతో తొలి రౌండ్‌లో బై లభించింది. ఆ తర్వాతి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన డానియల్ కాస్ట్రో, ఇనెస్ ది వెలాస్కో జంటతో తలపడింది. ఎనిమిది సార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన దీపిక కుమారికి మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్లలో 5 వెండి, 3 కాంస్య పతకాలు సాధించిన రికార్డు ఉన్నది. ఇప్పటి వరకు ఈ విభాగంలో స్వర్ణ పతకం లభించలేదు. దీపిక, అతాను దాస్ జంట 2020 జూన్‌లో వివాహం చేసుకున్నారు.



Next Story

Most Viewed