ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ ఈజిప్టులో మంగళవారం ఒక హైవేపై ట్రక్కును దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బస్సు బోల్తా పడింది. కనీసం 20 మంది మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రవాణా భద్రత రికార్డు తక్కువగా ఉన్న ఈజిప్టులో ఏటా ప్రమాదాలు జరిగి వేలాది మంది చనిపోతున్నారు. సరిగా లేని రోడ్లు, ట్రాఫిక్ చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఈ ఏడాది ఇప్పటికే 3,480 మందికి పైగా మరణించారు.


Next Story

Most Viewed