వలిగొండలో విషాదం.. కరోనాతో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి

by  |
Assistant lineman Venkatesh
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య జనాలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా.. కరోనా కాటుకు అసిస్టెంట్ లైన్‌మెన్ బలయ్యాడు. యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలానికి చెందిన కట్ట వెంకటేష్(38) వలిగొండ విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అనారోగ్య బారినపడిన ఆయన ఆస్పత్రిలో చేరగా, వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. అందులో వెంకటేష్‌కు పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో వారంరోజులుగా కరోనాతో పోరాడిన ఆయన పరిస్థితి విషమించి, సోమవారం తెల్లవారుజామున మరణించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేష్ మరణం పట్ల విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed