మల్కాపూర్‌లో అసిస్టెంట్ కమిషనర్

by  |
మల్కాపూర్‌లో అసిస్టెంట్ కమిషనర్
X

దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని ఆందోల్ మైసమ్మ గుడి ఆవరణలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ నల్లగొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కే.మహేందర్ కుమార్ మొక్కను నాటారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని దేవాలయాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన్నట్లు ఆయన పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో చిట్టడి వెంకట్ రెడ్డి, దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాస్, అర్చకులు శివ ప్రసాద్ శర్మ, విజయభార్గవచార్యులు, ఆలయ సిబ్బంది సత్తి రెడ్డి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed