- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలలో అత్యధిక కేసులున్న అసోం కట్టడి చర్యలను ఉధృతం చేస్తున్నది. గువహతి హెడ్క్వార్టర్గా ఉన్న కామరూప్ జిల్లాలో రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనుంది. ఈ నెల 28 అర్థరాత్రి నుంచి 14 రోజులపాటు ఈ జిల్లాలో లాక్డౌన్ అమలవుతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఈ కాలంలో కేవలం మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనూ వారాంతాల్లో లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. టౌన్ కమిటీలు, మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఈ లాక్డౌన్ అమలవుతుందని, తదుపరి నోటీసు విడుదల చేసే వరకు ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో 6,321 కేసులు నమోదవ్వగా, తొమ్మిది మంది ఈ కరోనాబారిన పడి ప్రాణాలుకోల్పోయారు.
Next Story