- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కమర్షియల్ వాహనాల దిగ్గజ సంస్థ అశోక్ లేలాండ్ బుధవారం తమ ఉద్యోగులు రవాణా అవసరాల కోసం ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. రవాణా కోసం కావాల్సిన ఎలక్ట్రిక్ వాహనాలను దశలవారీగా అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ లిమిటెడ్ నుంచి తీసుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
హిందూజా రెన్యూవబుల్స్ సంస్థతో కలిసి క్లీన్ ఎనర్జీని సేకరించనున్నట్టు, తద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు, స్థిరమైన, సామాజిక బాధ్యతయుతమైన కార్యకలాపాల వైపు వెళ్లేందుకు సహాయ పడుతుందని పేర్కొంది. ‘ఇటీవల జరుగుతున్న వాతావరణ మార్పులు, ఉద్గార రహితం అత్యవసరమని’ కంపెనీ పేర్కొంది. ‘అశోక్ లేలాండ్, స్విచ్ మొబిలిటీ సంయుక్తంగా అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో సమార్థ్యాన్ని కలిగి ఉంటాయని వెల్లడించింది.
Next Story