- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యాక్సిన్ వికటించి ఆశావర్కర్ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కొవిడ్ టీకా వేయించుకున్న విజయలక్ష్మి మృతి చెందడంతో గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఉదయం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. కరోనా టీకా వేయించుకుని ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందిందని ఆరోపించారు. విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షలు నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశావర్కర్గా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి ఈ నెల 19వ తేదీన కొవిడ్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: కొవిడ్ టీకా వేయించుకున్న విజయలక్ష్మి మృతి చెందడంతో గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఉదయం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. కరోనా టీకా వేయించుకుని ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందిందని ఆరోపించారు. విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షలు నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశావర్కర్గా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి ఈ నెల 19వ తేదీన కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. కాగా, 22న అస్వస్థతకు గురై జీజీహెచ్లో చేరింది. ఆదివారం ఉదయం విజయలక్ష్మి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Next Story






