ముస్లింలపై అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

by  |
Asaduddin Owaisi
X

దిశ, వెబ్‌డెస్క్ : ముస్లింలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిలాద్ – ఉన్ -నబీ సభలో మాట్లాడిన ఆయన మగాడికో న్యాయం.. ఆడవాళ్లకో న్యాయమా.. అని ప్రశ్నించారు. బుర్కా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు. బుర్కా వేసుకున్న అమ్మాయి.. మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారు. ముస్లిం అబ్బాయ్‌ ఎవరితోనైనా తిరగొచ్చా? ముస్లిం అమ్మాయి మాత్రం అలా కనిపించకూడదా..? ఇదేక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఇది 1969 కాదని.. 2021 లో ఉన్నామని గ్రహించాలన్నారు. కాలానికి తగ్గట్టుగా మారక తప్పదన్నారు. ప్రస్తుతం అసదుద్దీన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆచారాలను కఠినంగా పాటించే ముస్లింలు ఆయన కామెంట్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.



Next Story