అక్టోబర్ వరకు 200మంది ఉగ్రవాదులు హతం !

by  |
అక్టోబర్ వరకు 200మంది ఉగ్రవాదులు హతం !
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది అక్టోబర్ వరకు జమ్మూకాశ్మీర్‌లో 200మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వారిలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని భద్రతా అధికారులు వెల్లడించారు. జూన్‌ నెలలో అత్యధికంగా 49మందిని హత మార్చినట్లు పేర్కొన్న అధికారులు.. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపని పేర్కొన్నారు. ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌లో 28మంది చొప్పున ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోనే ఎక్కువ ఎన్‌కౌంటర్లు జరిగాయని, షొపిన్, పుల్వామాలో 98మంది ఉగ్రవాదులు ఎన్‌‌కౌంటర్‌లో చనిపోయారని అధికారులు వివరించారు.

Next Story

Most Viewed