హెచ్ఎండీఏపై బాధ్యత పెరిగింది

by  |
హెచ్ఎండీఏపై బాధ్యత పెరిగింది
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రణాళిక బద్ధగా పట్టణీకరణ రూపకల్పనలో, నిండైన పచ్చధనాన్ని హైదరాబాద్ మహానగరానికి తీసుకువస్తున్న హెచ్​ఎండీఏపై మరింత బాధ్యత పెరుగుతుందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రోపాలిటన్​ కమిషనర్​ అర్వింద్​ కుమార్​ చెప్పారు. శనివారం అమీర్​‌పేట్‌లోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం( స్వర్ణజయంతి కాంప్లెక్స్​) ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. ఆన్​లైన్​ అడ్మినిస్ట్రేషన్​, ట్రాన్స్​ఫరెన్స్​ అడ్మినిస్ట్రేషన్​లకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి కేటీఆర్‌ విజన్​‌కు అనుగుణంగా పట్టణాభివృద్ధి ప్రణాళికల అమలులో కీలక పాత్రను హెచ్ఎండీఏ పోషిస్తుందని తెలిపారు.

Next Story

Most Viewed