సెల్ఫ్ క్వారంటైన్‌లోకి కేజ్రీవాల్‌

by  |
సెల్ఫ్ క్వారంటైన్‌లోకి కేజ్రీవాల్‌
X

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్వరం, గొంతునొప్పితో బాధపడటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో ఆ వైరస్ టెస్టు చేయించుకోబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఆయన సమావేశాలన్నీంటిని రద్దు చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఓ ఆన్‌లైన్ సమావేశంలో చివరిసారిగా కనిపించారు. అనంతరం జ్వరం, గొంతు నొప్పి సమస్యలు రావడంతో వెంటనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా సోకిందేమోనన్న అనుమానాల నేపథ్యంలో త్వరలోనే ఆ వైరస్ టెస్టును జరిపించుకోబోతున్నట్టు తెలిసింది. ఢిల్లీలో కరోనా కేసులు 28,936లకు చేరగా, 812 మంది మరణించారు.



Next Story

Most Viewed