కరెంట్ బిల్ కోసం కిడ్నీలు అమ్ముతా: వార్షి

by  |
కరెంట్ బిల్ కోసం కిడ్నీలు అమ్ముతా: వార్షి
X

కరెంట్ బిల్ మోత మోగుతున్నది. షాక్ మీద షాక్‌లు ఇస్తున్నది. ఒక్కొక్కరి బిల్లు లక్షలు దాటుతుండగా..సోషల్ మీడియాలో తమ బాధలు చెప్పుకుంటున్నారు. మొన్న నటి తాప్సీ తన బాధ వర్ణిస్తూనే.. కరెంట్ లెక్కలు అంచనా వేయగా.. తాజాగా బాలీవుడ్ నటుడు, మున్నాభాయ్ ఎంబీబీఎస్ ఫేం అర్షద్ వార్షి సైతం తన ఎలక్ట్రిసిటీ బిల్ షేర్ చేశాడు.

తన ఇంటికి రూ.1,03,564 బిల్లు రాగా..తాను వేసిన పెయింటింగ్స్ ఎవరైనా కొంటే వచ్చిన డబ్బులతో బిల్ చెల్లిస్తానని చెప్పాడు. అయితే నెక్స్ట్ బిల్ కట్టాలంటే తప్పకుండా రెండు కిడ్నీలు అమ్మాల్సి వస్తుందని.. అందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తన బాధను అర్థం చేసుకోవాలని అంటున్నాడు. అటు సందీప్ కిషన్, హుమా ఖురేషి, కార్తీక లాంటి సెలబ్రిటీలు సైతం కరెంట్ బిల్లు‌పై ట్వీట్ల రూపంలో తమ నిరసన తెలిపారు.



Next Story

Most Viewed