- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కరోనా చికిత్సకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టు లేకపోయినా సీటీ స్కాన్లో కొరాడ్స్-4, సివియారిటీ స్కోర్ 25 ఉంటే హాస్పిటల్లో చేర్చుకోవాలని తెలిపింది.
ఎన్ఏబీహెచ్(నేషనల్ అక్రిడిడేటెడ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్) గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో నాన్ క్రిటికల్ ట్రీట్మెంట్కు రూ.4 వేలు, ఎన్ఏబీహెచ్ గుర్తింపు లేని ఆస్పత్రుల్లో నాన్ క్రిటికల్ కేర్కు రూ.3,600గా నిర్ణయించింది. ఇక నాన్ క్రిటికల్ విత్ ఆక్సిజన్ ట్రీట్ మెంట్కు సంబంధించి ఎన్ ఏబీ హెచ్ గుర్తింపు ఉన్న ఆస్పత్రులకు రూ.6,500, ఎన్ఏబీహెచ్ గుర్తింపు లేని ఆస్పత్రులకు రూ.5,850గా నిర్ణయించింది.
క్రిటికల్ కేర్ ఐసీయూ చికిత్సకు సంబంధించి గుర్తింపు ఉన్న ఆస్పత్రులకు రూ,12 వేలు, గుర్తింపు లేని ఆస్పత్రులకు రూ.10,800గా నిర్ణయించింది. క్రిటికల్ కేర్ ఐసీయూ విత్ వెంటిలేటర్ చికిత్సకు సంబంధించి రూ.16 వేలు, గుర్తింపు లేని ఆస్పత్రులకు రూ.14,400గా నిర్ణయించింది.