- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని వెంకటాపుర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దాదన్న కళ్యాణ్ రావు (25) గత ఆరేళ్ల క్రితం ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యారు. ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న కళ్యాణరావు.. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని బట్టిండా ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా చెట్టుపై నుంచి పడ్డారు. తీవ్ర గాయాలు పాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆయన స్వగ్రామం మాక్లూర్ మండలంలోని వెంకటాపూర్. శుక్రవారం మధ్యాహ్నం వరకు మృతదేహం వెంకటాపూర్ రానుందని, అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని కళ్యాణ్రావు తండ్రి వెంకట్ రావు, తల్లి వనజ తెలిపారు.
Next Story