- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికే స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెలికాప్టర్ ల్యాండింగ్కు ఐదు నిముషాల ముందే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. హెలికాప్టర్ కూలిన సమయంలో దట్టమైన పొగమంచు ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రమాదానికి కారణం దట్టంగా పొగమంచు కమ్ముకోవడమే అని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story