ప్రధాని మోడీని కలిసిన ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే..

by  |
ప్రధాని మోడీని కలిసిన ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే..
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత ప్రధాని మోడీని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే గురువారం కలిశారు. కొవిడ్ మేనేజ్‌మెంట్ సమయంలో భారత సైన్యం చేపట్టిన వివిధ ప్రణాళికలను ప్రధానికి ఆర్మీ చీఫ్ వివరించారు. అన్ని రాష్ట్రాలకు ఆర్మీ మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్మీ తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ ఆస్పత్రులను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఆక్సిజన్, వైద్య పరికరాలు రాష్ట్రాలకు చేర్చేందుకు ఆర్మీ సిబ్బంది అందుబాటులో ఉంటుందని నరవణే ప్రధాని మోడీకి వెల్లడించారు.


Next Story

Most Viewed