మహిళా పోలీసుతో జడేజా దురుసు ప్రవర్తన 

by  |
మహిళా పోలీసుతో జడేజా దురుసు ప్రవర్తన 
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ టీం (indian cricket team) ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన మహిళా పోలీసుతో ఆయన వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణం. రాజ్ కోట్ లో జడేజా తన భార్యతో కలిసి కారులో ఇంటి నుండి బయటకి వెళ్లారు. ఇద్దరూ మాస్కులు పెట్టుకొని కారణంగా హెడ్ కానిస్టేబుల్ సోనాల్ గోసాయి వారి కారును నిలిపారు.

మాస్కు ధరించని కారణంగా జరిమానా చెల్లించాలని సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జడేజా సదరు మహిళా పోలీసుతో గొడవకు దిగారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో ఆరోగ్యం పాడైన మహిళా పోలీసు ఆసుపత్రి పాలయ్యారు. ముసుగు ధరించి ఉన్నా లేడీ హెడ్ కానిస్టేబుల్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని జడేజా పోలీసులకు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ మనోహర్ సింగ్ మాట్లాడుతూ… జడేజా, లేడీ హెడ్ కానిస్టేబుల్ ఒకరి పట్ల మరొకరు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఇరువురిలో ఏ ఒక్కరూ ఇంకా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసారు. నాకు అందిన సమాచారం ప్రకారం జడేజా మాస్క్ ధరించారు కానీ ఆయన భార్య ధరించారో లేదో తెలియాల్సి ఉంది అన్నారు.

Next Story