పొగడ్తల కోసం అసెంబ్లీ నిర్వహిస్తున్నారా..!

by  |
పొగడ్తల కోసం అసెంబ్లీ నిర్వహిస్తున్నారా..!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో అవర్‌ను ఎత్తివేశారు, అధికార పార్టీ నేతలు కేసీఆర్‌ను పొగడటానికే సమావేశాలు నిర్వహించినట్టు ఉందని విమర్శించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయని అన్నారు. అధికార పార్టీ సభ్యులతో పొగడ్తలకు మాత్రం సభలో సమయం ఇస్తారా.. ప్రజా సమస్యలపై మాట్లాడానికి మాత్రం ప్రతిపక్షాలకు టైం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తపరిచారు.

Next Story