ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. APSRTC కీలక నిర్ణయం..

by  |
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. APSRTC కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్ డెస్క్: రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారి కోసం రిజర్వేషన్ గడువును పెంచింది. ఇంతకు ముందు ఏ ప్రయాణం చేయాలన్నా కేవలం 30 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే తాజాగా ఆ గడువును 60 రోజులకు పెంచుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

దాంతో దూర ప్రాంతాలకు బయలుదేరాలి అనుకునే వారికి ఇదొక సువర్ణావకాశంగా మారింది. ముందుగా ప్రయాణాలను రిజర్వ్ చేసుకోవడం వల్ల ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు అని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

Next Story