వ్యవసాయ సబ్సిడీలకు రూ.416 కోట్లు

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే సబ్సిడీకిగాను ట్రాన్స్‌కో, డిస్కంలకు తెలంగాణ ప్రభుత్వం రూ.416 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెల విద్యుత్ సబ్సిడీల కోసం ఈ నిధులిస్తున్నట్టు పేర్కొంటూ పరిపాలన అనుమతులు జారీ చేశారు. వ్యవసాయ రంగ సబ్సిడీకి ఇదే నెల మొదటివారంలో ఆర్థిక శాఖ ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి రూ.1,250 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా కోట్ చేశారు.

tags :telangana power, subsidies, agriculture related, g.o


Next Story

Most Viewed