కేసీఆర్ నిర్ణయం.. ఆకుల లలిత, జూలూరి గౌరీశంకర్‌కు కీలక బాధ్యతలు

by  |
కేసీఆర్ నిర్ణయం.. ఆకుల లలిత, జూలూరి గౌరీశంకర్‌కు కీలక బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆకుల లలిత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేశ్ నియామకమయ్యారు.

స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్‌ను నియమించారు. షీప్‌ అండ్‌ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాలరాజు యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడుతున్నాయి.

Next Story

Most Viewed