మంత్రులుగా అప్పల్రాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణస్వీకారం

by  |
మంత్రులుగా అప్పల్రాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్: నూతన మంత్రులుగా సీదిరి అప్పల్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో వీరి చేత గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, స్పీకర్ తమ్మినేని సీతారం, మంత్రి ధర్మన కృష్ణదాసతోపాటు పలువురు పాల్గొన్నారు. ప్రణాశ్వీకారం స్వీకార కార్యక్రమానికి ముందు అప్పల్రాజు, వేణుగోపాలకృష్ణ తమ కుటుంబ సభ్యులతో రాజ్ భవన్ కు చేరుకున్నారు. అయితే కరోనా కారణంగా కొద్దిమందికి మాత్రమే అనుమతిచ్చారు. అయితే, సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి స్థానంలో వీరికి మంత్రివర్గంలో అవకాశం దక్కింది.



Next Story

Most Viewed