వన్ ఫ్యామిలీ.. త్రీ జనరేషన్స్.. ‘అప్నే 2’

by  |
వన్ ఫ్యామిలీ.. త్రీ జనరేషన్స్.. ‘అప్నే 2’
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్. ఒక నటుడు స్టార్‌గా ఎదిగాడంటే తన తర్వాతి తరాలు కూడా అదే ఫీల్డ్‌ను కంటిన్యూ చేస్తాయి. తెలుగులో మెగా ఫ్యామిలీ, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు ఎలాగైతే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాయో బాలీవుడ్‌లోనూ అదే పద్ధతి కొనసాగుతోంది. ఖాన్, కపూర్, డియోల్ ఫ్యామిలీస్‌ ఇదే కోవకు చెందుతాయి. అయితే నార్మల్‌గా తమ అభిమాన నటుడి నుంచి సినిమా వస్తేనే మురిసిపోయే జనం.. ఆ నటుడి ఫ్యామిలీ మొత్తం కలిసి తెరపై కనిపిస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా! తెలుగులో అక్కినేని అభిమానులు మూడు జనరేషన్లను ఒకేసారి తెరపై చూసి ఎంతగా ఆనందపడిపోయారో తెలుసుగా. ఇలాంటి సినిమానే హిందీలోనూ రాబోతుంది. డియోల్ ఫ్యామిలీకి చెందిన త్రీ జనరేషన్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాయి.

2007లో తండ్రి ధర్మేంద్ర .. కొడుకులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో కలిసి ‘అప్నే’ సినిమా చేశారు. అనిల్ శర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ కాగా, గురునానక్ జయంతి సందర్భంగా ఈ సినిమా సీక్వెల్ ప్రకటించారు ధర్మేంద్ర అండ్ ఫ్యామిలీ. ‘అప్నే 2’ సినిమాలో ధర్మేంద్ర కొడుకులతో పాటు మనవడు కరణ్ డియోల్ కూడా కనిపించబోతున్నాడు. అనిల్ శర్మనే సీక్వెల్ కూడా డైరెక్ట్ చేస్తుండగా.. సోహమ్ రాక్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై దీపక్ ముకుత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Next Story

Most Viewed