ఏపీలో మద్యం ధరలకు రెక్కలు

by  |
ఏపీలో మద్యం ధరలకు రెక్కలు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య నిషేధంపై పట్టుదలగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు 45 రోజులుగా నిలిపేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సడలింపుల నేపథ్యంలో రేపటి నుంచి ఏపీలో మద్యం షాపులను తెరువనున్నారు. ఈ క్రమంలో మద్యం ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికే ఏపీలో బెల్టు షాపులను నియంత్రించిన ప్రభుత్వం, వలంటీర్ల సాయంతో మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేసింది. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే మద్యం షాపులను నడిపే ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే మద్యం ఉత్పత్తికి 14 డిస్టెల్లరీస్‌కి అనుమతిచ్చింది. అయితే ధరలు అందుబాటులో లేకుంటే మద్యాన్ని నియంత్రించవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి మద్యం దుకాణాలను తెరువనున్నామన్న శుభవార్త చెబుతూనే… మద్యం ధరలను 25 శాతం పెంచుతోంది. పెంచిన ధరలను రేపటి నుంచే అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

tags: lockdown, liquor shops, liquor business, ap, liquor rates



Next Story

Most Viewed