- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రాయలసీమ : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెల రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని అమిత్ షా ఆదేశించారు. ట్రైబ్ యూనివర్శిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిషికేషన్ ద్వారా ప్రకటించాలన్న సీఎం జగన్ విజ్ఞప్తికి అమిత్ షా అంగీకరించారు.
తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. 24 కొత్త అంశాలతో పాటు ఖరారు చేసే అంశాలపై కూడా చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలో పరిష్కారం కావాలన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, న్యాయం చేసేలా చొరవ చూపాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదని, ఆ హామీని నెరవేర్చాలని కోరారు.
రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయి..
రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు మాకు రుణాల్లో కోత విధిస్తున్నారని జగన్ అన్నారు. ఇక గ్రేహౌండ్స్ ఏర్పాటుపై సీఎం జగన్ మాట్లాడగా స్థలం ఇస్తే తామే ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. శిక్షణ పొందిన వారిలో సగం మందిని కేంద్ర బలగాలకు ఇవ్వాలని అమిత్ షా అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలని జగన్ విజ్ఞప్తి చేయగా, అమిత్ షా అంగీకరించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లోనే కార్యాచరణ సిద్ధం చేయాలని అమిత్షా ఆదేశించారు.
సమస్యలను పరిష్కరిస్తాం..
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సమస్యలపై అమిత్షా స్పందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రాష్ట్రాలకు చెందినవి మాత్రమే కాకుండా ఇవి జాతీయ అంశాలని అన్నారు. ఏపీ సీఎం జగన్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని అమిత్షా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని అన్నారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు ఇంకా అమలు కావడం లేదని అన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కాకుండానే మిగిలిపోతున్నాయని, దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుతుందని అన్నారు.