- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహనిర్మాణ సంస్థలను అవినీతి సంస్థగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా.. ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని విమర్శించారు. అంతేగాకుండా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదని వెల్లడించారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేశారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో టీడీపీ కోర్టుకు వెళ్లినట్టు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. వచ్చే సంక్రాంతి నాటికి 2,62,000 మందికి ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే లబ్దిదారులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.