ఫోటో ఓటర్ల జాబితా మార్పులు చేర్పులకు నోటిఫికేషన్

by  |
ఫోటో ఓటర్ల జాబితా మార్పులు చేర్పులకు నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోటో ఓటర్ల జాబితా సవరణ, మార్పులు చేర్పులపై అభ్యంతరాల స్వీకరణకు ప్రకటన విడుదల చేసింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది. నవంబర్ 16న సవరించిన ముసాయిదాను విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. చివరిగా తుది ఫోటో ఓటర్ల జాబితాను 2021 జనవరి 15న ఈసీ ప్రకటించనుంది.

Next Story

Most Viewed