రేపు ఉ.10 గంటలకు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

by  |
nimmagadda
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచారు. ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేగాకుండా రేపు ఉదయం పది గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ భేటీ ఆయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని గవర్నర్‌కు నిమ్మగడ్డ తెలిపారు. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనపై స్పష్టత ఇచ్చారు.



Next Story