మేయర్ ఎన్నికపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

by  |
Nimmagadda-Ramesh-Kumar
X

దిశ, వెబ్ డెస్క్: మార్చి 18న మేయర్, మున్సిపల్ చైర్మన్ ల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఏలూరు మినహా మిగిలిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు చైర్మన్లను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తొలుత గెలిచిన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. చైర్మన్, మేయర్ ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎక్స్‌ అఫిషియో హోదాలో ఓటు హక్కు కల్పించారు. ఈ సందర్భంగా గుర్తింపు కలిగిన పార్టీలకు విప్‌ జారీచేసే అవకాశం కనిపిస్తోంది.

Next Story

Most Viewed