పుర ఎన్నికలపై ఫిర్యాదులకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు

by  |
ap sec
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఈనెల 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీకి పలు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఎస్‌ఈసీ ఆఫీస్‌లో కాల్‌ సెంటర్‌ను శుక్రవారం ఏర్పాటు చేశారు. పుర ఎన్నికలపై ఫిర్యాదుల కోసం ఈ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌ను ప్రజలు 0866 2466877 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. కోడ్‌ ఉల్లంఘన జరిగితే కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed