పోటెత్తిన జనం.. ఎక్కడంటే..?

by  |
పోటెత్తిన జనం.. ఎక్కడంటే..?
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణలో మరో సారి లాక్ డౌన్ విధిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు సొంత వాహనాల్లో స్వస్థలాలకు బయల్దేరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులకు ప్రజలు పోటెత్తారు. దీంతో సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద రద్దీ నెలకొంది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏపీలోకి రావాలంటే అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సరిహద్దుల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


Next Story