- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ జూలై 22న జరగనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఖాళీ అయిన ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గాలకు చెందిన ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు మంత్రి వర్గంలో స్థానంలో కల్పించనున్నారంటూ ఊహాగానాలు చెలరేగినప్పటికీ…తాజాగా గత మంత్రుల సామాజిక వర్గానికి చెందిన వారినే మంత్రులను చేసేందుకు సీఎం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పిల్లి సుభాష్ చంద్రబాస్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు, మోపిదేవి వెంకటరమణ స్థానంలో శ్రీకాకుళం జిల్లా, పలాస ఎమ్మెల్యే అప్పల రాజుకు కేబినెట్లో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరి శాఖలు మాత్రం మారుతాయని, జులై 22న వీరు మంత్రి వర్గంలో చేరుతారని సమాచారం.