జెడ్పీటీసీ- ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి : మంత్రి పెద్దిరెడ్డి

by  |
Minister Peddireddy
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయ అవరోధాలు తొలగినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియకు 6 రోజులు సరిపోతుందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగవతం చేయాలంటే ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశమంతా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని.. అయితే రాష్ట్రంలో మాత్రం ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ఆలస్యమవుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తి చేస్తే ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం పెంచుతామని వివరించారు. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో జరిగాయని ఈ జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే పూర్తి కావాలని..ఆ తర్వాతే ఎస్ఈసీ పదవీ విరమణ చేయాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed