- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయ అవరోధాలు తొలగినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియకు 6 రోజులు సరిపోతుందని తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగవతం చేయాలంటే ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశమంతా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని.. అయితే రాష్ట్రంలో మాత్రం ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్ ఆలస్యమవుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తి చేస్తే ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగం పెంచుతామని వివరించారు. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో జరిగాయని ఈ జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే పూర్తి కావాలని..ఆ తర్వాతే ఎస్ఈసీ పదవీ విరమణ చేయాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.