పవన్ దమ్ముంటే ఒంటరిగా బరిలోకి దిగు.. మంత్రి సవాల్

by  |
పవన్ దమ్ముంటే ఒంటరిగా బరిలోకి దిగు.. మంత్రి సవాల్
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌కు దమ్ము ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ హెచ్చరించారు. 38ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం, దమ్ములేదని విమర్శించారు. ఈ 38ఏళ్ల చరిత్రలో ఏనాడైనా ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా టీడీపీ పోటీ చేసిందా? అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ పొత్తు లేకుండా పోటీ చేసే సాహసం చేయలేదని..ఇకపై చేసే పరిస్థితి కూడా రాదంటూ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed