అది తాత్కాలిక సచివాలయం: మంత్రి అప్పలరాజు

by  |
అది తాత్కాలిక సచివాలయం: మంత్రి అప్పలరాజు
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి వెలగపూడిలో నిర్మించింది తాత్కాలిక సచివాలయమే అని ఏపీ మంత్రి అప్పలరాజు అన్నారు. ముందస్తు వ్యూహం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం వెళ్తోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమే అంటూ అప్పలరాజు అభిప్రాయపడ్డారు. అలాగే, విశాఖ పరిపాలన రాజధాని అవుతోందని వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖ నేతలు విశాఖకు వస్తారని స్పష్టం చేశారు. పాలనా రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలియజేశారు.

Next Story

Most Viewed