అనుకున్న సమయానికే పోలవరం పూర్తి : మంత్రి అనిల్

by  |
anilkumar yadav minister ap
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గోదావరి నదికి వరదలు వచ్చే సమయానికల్లా స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, గేట్లు అన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పర్, లోయర్ డ్యామ్‌లను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి నీటిని స్పిల్ వే ద్వారా దిగువకు మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి అనిల్ తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. గత వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు గుర్తించామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కాపర్ డ్యామ్ పనులు పూర్తయిన తర్వాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్యామ్ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి క్వాలిటీతో పోలవరం డ్యామ్ నిర్మాణం జరుగుతుందని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ తెలిపారు.

Next Story

Most Viewed