- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గత రెండు రోజులుగా కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ను కమ్ముకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పెద్ద పోరాటమే చేస్తోంది. ఇప్పటికే రెండు పాత జీవోల బూజు దులిపి వెలికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల సేవల్ని కూడా వినియోగించుకునే పనిలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దగ్గర్నుంచి గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ వంతు సాయమందించేందుకు ముందుకు వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లోని సభ్యులు తమ మూడు రోజుల వేతనాన్ని కోవిడ్-19 సహాయచర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేస్తూ, సంబంధిత పత్రాన్ని ఆయనకు అందజేశారు.
Tags: ips officers, cm relief fund, ys jagan, goutam sawang, andhrapradesh