బ్రేకింగ్: గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్.. 4 వారాలు స్టే

by  |
ap-highcourt 1
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 పరీక్షల ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలపై స్టే విధించింది. 4 వారాల పాటు స్టే విధించిన హైకోర్టు.. తదుపరి చర్యలన్నీ ఆపేయాలని ఆదేశించింది. గ్రూప్ -1 ఆన్సర్ పేపర్స్ కరెక్షన్ ప్రైవేట్ సంస్థకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అభ్యర్థుల ఆన్సర్ షీట్స్ తమకు అందించాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గ్రూప్-1 ఇంటర్వ్యూల తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.


Next Story

Most Viewed