ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

by  |
ap highcourt
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఈ మేరకు రాష్ట్ర మంత్రులకు నోటీసులు జారీచేసింది. ఏపీ గవర్నర్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఎస్ఈసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రివిలేజ్ లెటర్స్ లీక్‌ అవలేదని గవర్నర్ సెక్రటరీ చెప్పినట్లు ఎస్‌ఈసీ న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు.. మంత్రులకు నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed