ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

by  |
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ తీర్పు చెప్పింది. నాలుగు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ జారీ చేయగా.. దీనిపై శనివారం ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఎస్ఈసీ షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని భావించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పట్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు లేనట్లే.



Next Story