ఎస్ఈసీకి హై‌కోర్టు షాక్

by  |
ఎస్ఈసీకి హై‌కోర్టు షాక్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ వాహనాల రంగుల విషయంలో ఎస్ఈసీ ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఎస్ఈసీకి హైకోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హై కోర్టు తెలిపింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ వాహనాలపై ఉన్న వైసీపీ జెండా రంగులను మార్చాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైఎస్ సర్కార్ హై కోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed