బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-06-17 06:56:43  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు తీర్పుతో ఆయన మళ్లీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం అశోక్ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లీజు గడువు పూర్తైన ట్రస్టు భూములను వేలం వేయాలని ఆదేశించారు. మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాల వివరాలు, పడేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించని ఫీజు వివరాలు ఈ నెల 21లోగా తెలపాలని ఆదేశించారు. మాన్సాస్ ట్రస్టు సిబ్బందికి [&hellip;]</p>

బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు
X

దిశ, వెబ్‌డెస్క్: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు తీర్పుతో ఆయన మళ్లీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం అశోక్ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లీజు గడువు పూర్తైన ట్రస్టు భూములను వేలం వేయాలని ఆదేశించారు.

మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాల వివరాలు, పడేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించని ఫీజు వివరాలు ఈ నెల 21లోగా తెలపాలని ఆదేశించారు. మాన్సాస్ ట్రస్టు సిబ్బందికి జీతాలు ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించిన అశోక్ గజపతిరాజు.. కార్యాలయాన్ని విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారని నిలదీశారు.

Next Story