వైసీపీ రంగులపై హైకోర్టు ఆగ్రహం

by  |
వైసీపీ రంగులపై హైకోర్టు ఆగ్రహం
X

అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయడమేంటని నిలదీసింది. ఏ పార్టీకి చెందని రంగులనే వేయాలని ఆదేశించింది. దీని అమలులో విఫలమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే పూర్తి బాధ్యత వహించాలని వెల్లడించింది. అలాగే, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించింది.

tags: high court, ap news, cm jagan, ycp, ycp colours, panchayat,



Next Story

Most Viewed