ప్రభుత్వోదోగులూ.. ఎక్కడికీ వెళ్లొద్దు: ఏపీ సర్కార్

by  |
Elections
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ సహా ఇతర ఏ రాష్ట్రాలకూ వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సరైన మెడికల్ సర్టిఫికేట్స్ సమర్పిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతిస్తామని తెలిపింది. అలాగే, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదనీ, వాళ్లు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించారు.



Next Story