విగ్రహాల ధ్వంసం కేసులపై సిట్​ఏర్పాటు

by  |
విగ్రహాల ధ్వంసం కేసులపై సిట్​ఏర్పాటు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కేసులను ఛేదించేందుకు ప్రభుత్వం 16 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్​) చీఫ్​గా విజయవాడ ఏసీబీ అడిషనల్​డైరెక్టర్​ జీవీజీ అశోక్​కుమార్​ను నియమిస్తూ శుక్రవారం డీజీపీ గౌతం సవాంగ్ ​ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ దర్యాప్తు బృందంలో కృష్ణా, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 15 మంది పోలీసు అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటిదాకా నమోదైన విగ్రహాల ధ్వంసం కేసులపై దర్యాప్తు చేయనున్నారు. ప్రభుత్వం తొలుత ఈ కేసులను సీఐడీకి అప్పగించింది. కేసుల్లో సత్వర పురోగతి కోసం ప్రభుత్వం సిట్​ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed