కాపు కార్పొరేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

by  |
కాపు కార్పొరేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు అధికార, అనధికార డైరెక్టర్ల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక డైరెక్టర్లుగా ఏడుగురు, అనధికార డైరెక్టర్లుగా 12 మంది నియమించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. నామినేటెడ్ ఛైర్మన్ లేనిపక్షంలో ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌గా బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి ఉంటారని తెలిపింది. త్వరలోనే కాపు కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించేందుకు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లతో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story