బ్రేకింగ్.. సాయితేజ ఫ్యామిలీకి అండగా జగన్ సర్కార్.. ఆర్థిక సాయం అందజేత

by  |
బ్రేకింగ్.. సాయితేజ ఫ్యామిలీకి అండగా జగన్ సర్కార్.. ఆర్థిక సాయం అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్ : హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది. వారి ఫ్యామిలీకి ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. శనివారం ఉదయం రూ. 50 లక్షల చెక్కును సాయితేజ కుటుంబ సభ్యులకు మంత్రి పెద్దిరెడ్డి అందజేశారు.

ఇదిలా ఉండగా డిసెంబర్ 8వ తేదీన తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రిదాళపతి బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈయనకు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‎లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయి తేజ కూడా ఈ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నేటి సాయంత్రం సాయితేజ పార్థివదేహం ఆయన స్వస్థలానికి చేరుకోనుంది. రేపు (ఆదివారం) సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు జరుగునున్నాయి.


Next Story

Most Viewed