ఏపీలో పరిశ్రమలకు ఆధార్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: పరిశ్రమలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ తరహాలో ప్రతి పరిశ్రమకు ఇకపై ‘‘పరిశ్రమ ఆధార్’’ పేరుతో ప్రత్యేక సంఖ్యకు కేటాయించనుంది. ఈమేరకు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలపై సమగ్ర సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలోని కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే నిర్వహించనుంది. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరుతో [&hellip;]</p>

ఏపీలో పరిశ్రమలకు ఆధార్
X

దిశ, వెబ్ డెస్క్: పరిశ్రమలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ తరహాలో ప్రతి పరిశ్రమకు ఇకపై ‘‘పరిశ్రమ ఆధార్’’ పేరుతో ప్రత్యేక సంఖ్యకు కేటాయించనుంది. ఈమేరకు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలపై సమగ్ర సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలోని కార్మికులు, విద్యుత్, భూమి, నీరు, ఎగుమతి, దిగుమతులు, ముడి సరకు లభ్యత, మార్కెటింగ్ తదితర 9 అంశాల్లో పరిశ్రమల శాఖ సర్వే నిర్వహించనుంది. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 లోపు సర్వేను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story